భగవద్గీత ఉపనిషత్తుల సారాంశం: ఉపనిషత్తులు వేదాంతం. కావున ప్రాచీన
కాలంలో ఆధ్యాత్మికత అంతా ప్రకృతి ఆరాధన నుంచే ప్రారంభమైందని గమనించవచ్చు.
నాడు విజ్ఞానమంటే ఆధ్యాత్మిక జ్ఞానమే, ప్రకృతిని ప్రేమించిన మానవుడే, తోటి
జీవులను ప్రేమిస్తాడని తొలి భావన ఆనాడు ఉండేది. యజ్ఞం, ప్రార్థన విస్తరించి
ఆధ్యాత్మిక భావనలో క్రియా యోగంగా అవతరించాయి. అందుకే గీతలో అన్ని
అధ్యాయాలకు ‘యోగా’ అని ఉంటుంది. యోగా అంటే భగవంతునితో భక్తుని సంయోగం
(విలీనం) అనే అర్థం మొదట్లో ఉండేది. సృష్టికి కారణమైన తాను బలవంతుడని
చెప్పాడు, అట్లని మానవులు ఏ కష్టం లేకుండా కేవలం తననే నమ్ముకుంటే ప్రయోజనం
లేదని కూడా హెచ్చరించాడు. నమ్మకమే మనిషిని ఉన్నతుడిని చేస్తుందని పరిపూర్ణ
విశ్వాసం లేని పూజ వల్ల ప్రయోజనం లేదంటుంది. అంతేనా ‘స్వధర్మ’ నిర్వహణ కూడా
ఆధారణలో భాగమనే విశిష్ట లక్షణం. వివరించటమే ప్రపంచ ఆధ్యాత్మిక గ్రంథాల్లో
‘గీత’కు గల గొప్ప సుగుణం అంతేనా; ‘కర్మ’ చేయటంలో దైవారాధన ఉనికి
గుర్తించమని చెబుతూనే ‘నిష్కామ కర్మ’ వల్లే మోక్షం లభిస్తుందని చాటుతుంది
గీత. ఇంకో విషయమేమిటంటే ‘గీత’ మానసిక ఆరాధనకు, ధైవచింతన భక్తిభావన
ఎంతముఖ్యమంటుందో శారీరక ఆరోగ్య విషయములో ఆహార నియమాలు ఎలా పాటించాలో ఆయా
ఆహార గుణాలే మనిషిలోని ప్రవర్తనలకు ఎలా హేతువులౌతాయో వివరిస్తుంది. అంటే ఏక
కాలంలో మానసిక, శారీరక వ్యవస్థకు, హితోపదేశం చేయటం ‘గీత’కు గల మరో విశిష్ట
లక్షణం. భగవద్గీత వలన అమూల్యమైన విషయాలు ఎన్నో తెలుస్తాయి.
ధర్మమే
జయిస్తుందని, జననమరణాలు సహజమని, శోకం మనిషికి మంచిది కాదని, ఈ ప్రపంచంలో
ఎవరూ శాశ్వతం కారని, ఉన్నంతలో నలుగురికి మంచి చేయాలని చెబుతుంది. భగవద్గీత
నిత్యపారాయణ గ్రంథం మాత్రమే కాదు, నిత్య జీవన సూక్తి ముక్తావళి కూడా. ఒక
గీతను క్షుణ్ణంగా పఠిస్తే, సర్వశాస్త్ర పఠనంతో సమానమంటారు. భగవత్స్వరూప
తత్త్వ జ్ఞాన పరంపర గీత ద్వారా మనకు పూర్తిగా తెలుస్తుంది. కారణం ఇందులో
భగవంతుని అపరాపరావూపకృతుల వివరణ ఉంది. సృష్టి భూతముల, ఉత్పత్తి వంటి గొప్ప
విషయాలు ఉన్నాయి. ‘అనన్య భక్తి’ గురించి చర్చించి, మహాభక్తుల జీవితాలు ఎలా
ధన్యమయ్యాయో వర్ణిస్తుంది. భక్తులు, భక్తి ఆరాధనా ప్రాముఖ్యత వివరిస్తుంది.
సద్గుణ,
నిర్గుణ ఉపాసన తాత్విక చింతన ప్రబోధిస్తుంది. జ్ఞాన, కర్మ, భక్తి భావాలందు
ఏ ఒక్కటి గొప్ప కాదని తనను ఏ మార్గంలోనైనా చేరవచ్చుననే సమతాభావం గీత
వర్ణిస్తుంది. ఈ విధంగా విశ్వవ్యాప్తమై విశిష్టక్షిగంతమై వెలిగిన భగవద్గీత
అత్యున్నత ఆద్యాత్మిక గ్రంథంగా భావించి అందరం గౌరవించాలి. గీతాసారం అర్థం
చేసుకొని జీవిస్తే వారి జీవితం ఆనందతుల్యమై ప్రశాంతంగా గడుస్తుందని
భావించాలి.. అదే గీతకు గల విశిష్ట లక్షణం కూడా.
- డా॥ బి. దామోదరరావు
944096279
944096279
No comments:
Post a Comment